ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు స్పెషల్ కోర్టు షాకిచ్చింది. అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రా రెడ్డి, బినోయ్ బాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ కోసం వారు పెట్టుకున్న బెయిల్ పిటీషన్లను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, గౌతమ్ మల్హోత్రా , చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషీ ని ఈడీ అరెస్ట్ చేసింది. ఒయాసిస్ గ్రూప్ తో మల్హోత్రాకు సంబంధాలున్నాయని అనుమానాలు, ఆరోపణల నేపథ్యంలో అతడిని 5 రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. ఇక గౌతమ్ మల్హోత్రా కస్టడీ నిన్నటితో ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు.కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.