ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బుధవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపించారాయన.
2016 నుంచి అనిల్ బైజల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. అయితే ముందునుంచీ సీఎం కేజ్రీవాల్ కు ఆయనకు పొసగడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, ఇతర కీలక నిర్ణయాల్లో అనిల్ బైజల్ ఇబ్బందిపెడుతున్నారని పలుమార్లు కేజ్రీ ఆరోపించారు. అయితే వ్యక్తిగతకారణాలతోనే రాజీనామా చేసినట్టు బైజల్ తెలిపారు.