ఢిల్లీ మద్యం కేసులో డిల్లీ కోర్టులో సీబీఐకి చుక్కెదురైంది. అభిషేక్ రావు, విజయ్ నాయర్ బెయిల్ పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.మద్యం కుంభకోణం వ్యవహారంలో సహకరించడం లేదంటూ ఇద్దరినీ సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తరువాత మరో 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ తరువాత ఈనెల 21న రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ డిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది సీబీఐ. దీనిపై గురువారం విచారణ జరిపింది. బెయిల్ రద్దు చేయాలన్ని సీబీఐ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది.