ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి
సత్యేంద్ర జైన్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెలువరించింది. గతేడాది మే 30 నుంచి సత్యేంద్ర జైన్ కస్టడీలోనే ఉన్నారు.పలుకుబడి ఉన్న జైన్ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదే కేసులో సహనిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్ లకూ బెయిల్ తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో 2022మేలో ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ వైద్యారోగ్యశాఖా మంత్రిగా ఉన్న ఆయన మార్చి1న రాజీనామా చేశారు.