ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల పై హ్యాకర్ల దాడి చైనా పనేనని తేలింది. హ్యాకింగ్ చైనా నుంచే జరిగినట్టు విచారణలో తేలిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని సమాచారం. ఢిల్లీ ఎయిమ్స్ లో మొత్తం 100 సర్వర్లుండగా 60 వర్చువల్ గా,40 ఫిజికల్గా పనిచేస్తున్నాయి. వాటిల్లో 5 సర్వర్లలోకి చైనా హ్యాకర్లు చొరబడ్డారు. వెంటనే అప్రమత్తమైన యంత్రాంగం అందులోని లక్షలాదిమంది రోగుల డేటాను తిరిగి పొందింది. సర్వర్లో ఈ-హాస్పిటల్ ను పునరుద్ధరించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.