ఢిల్లీ సర్కారు, లెఫ్టినెంట్ గవర్నర్ కు మధ్య జగడం ముదురుతోంది. తన పరువుకు భంగం కలిగించేలా ఆరోపణలు చేసిన ఆప్ నాయకులపై వినయ్ కుమార్ సక్సేనా అన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పై మండిపడ్డారు. అలాగేతనపై అవినీతి ఆరోపణలు చేసిన అతిషి, జాస్మిన్ షా, దుర్గేష్ పాఠక్, సౌరభ్ భరద్వాజ్ పై చట్టపరమైన చర్యలకు ఎల్జీ సిద్ధమైనట్టు సమాచారం.దుర్గేష్ పాఠక్ అయితే అసెంబ్లీ వేదిగ్గా సక్సేనాపై ఆరోపణలు చేశారు. 2016లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమ కమిషన్ చైర్మన్ గా ఉన్న కాలంలో జరిగిన నోట్ల రద్దు సందర్భంగా తన దగ్గరున్న 14 వందల కోట్ల విలువైన నోట్లను మార్చాలని విభాగంలోని అధికారులను సక్సేనా ఆదేశించినట్టు ఆప్ ఆరోపిస్తోంది. ఆయితే ఆ ఆరోపణల్ని ఖండించారు సక్సేనా.
ఉత్తమపాలన అందించమని తాను సూచిస్తే..బదులుగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేజ్రీ, అతని టీం ఆపసోపాలు పడుతోందని వ్యాఖ్యానించారు. తనపైనా, తన కుటుంబంపైనా వ్యక్తిగత దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు సక్సేనా.