ఉత్తర అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా అండమాన్&నికోబార్ దీవుల వెంట మయన్మార్ కోస్ట్లైన్ వైపు కదులుతోంది. ఈ అల్పపీడనం మరికొద్ది గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది.
మార్చి 23 తెల్లవారుజామున మయన్మార్ తీరం దాటుతుంది. మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది మాయాబందర్కు తూర్పు-ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో కదులుతోంది.
అండమాన్&నికోబార్ దీవులలో పెద్దగా ప్రభావం కనిపించలేదు.. కానీ దీవుల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
మరో ఒకటి రెండు రోజుల పాటు బలమైన గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అంచనా. మత్స్యకారులను మార్చి 23 వరకు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.
ముందు జాగ్రత్త చర్యగా A&N దీవుల్లోని అన్ని పర్యాటక కార్యకలాపాలను రేపటి వరకు నిలిపివేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టరేట్ కొనసాగుతున్న పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయిలో క్విక్ రెస్పాన్స్, ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేశారు.
పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్ర కంట్రోల్ రూమ్ అత్యవసర నంబర్లు పనిచేస్తున్నాయి. ఉత్తర-మధ్య అండమాన్ జిల్లాలోని రంగత్, మాయాబందర్, డిగ్లీపూర్లోని వివిధ లోతట్టు ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం NDRF సహాయంతో మత్స్యకారులు, స్థానిక నివాసులతో సహా 1000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)