భారతదేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నవీకరించిన అధికారిక డేటా ప్రకారం ఇవాళ 2,323 తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 14,996 కి తగ్గింది. 25 మరణాలతో మరణాల సంఖ్య 5,24,348కి చేరుకుంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉన్నాయి. మంత్రిత్వ శాఖ ప్రకారం జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది. యాక్టివ్ కోవిడ్-19 కేసు లోడ్లో 24 గంటల వ్యవధిలో 48 కేసుల తగ్గుదల నమోదైంది.
కోవిడ్-19కి వ్యతిరేకంగా టీకాలు వేసుకోవాలని జూన్, జూలైలో రెండు నెలల పాటు ఇంటింటికి ప్రచారం చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. బూస్టర్ డోస్తో టీకాలు వేసుకోవడానికి అర్హులైన సీనియర్ సిటిజన్లకు ఈ ప్రచారం ప్రాధాన్యతనిస్తుంది.