అలాగే భారతదేశంలోజూన్ 1-10 మధ్య 281 జిల్లాల్లో నివసిస్తున్న 17,800 మందిప్రజలను కలిసి , 2020 లో గాల్వన్ లో హింసాత్మకఘర్షణ తరువాత, 34 % మంది 1-2 చైనీస్ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేశారని, 8% మంది 3-5 ఉత్పత్తులను కొనుగోలు చేశారని, 4%మంది వినియోగదారులు 5-10 మేడ్-ఇన్- చైనా ఉత్పత్తులను , 3%మంది 10-15, 1%మంది 20 కి పైగా, మరో1% 15-20 ఉత్పత్తులు కొనుగోలు చేసారని . మిగిలిన6% భారతీయ వినియోగదారులు ఎటువంటి అభిప్రాయం చెప్పలేదు. గడిచిన 12 నెలల్లో 43% భారతీయులు చైనాలో తయారైన ఏ వస్తువులు కొనుగోలు చేయలేదని నివేదిక ద్వారా తెలుస్తున్నది.చైనీస్ వస్తువులను కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది తక్కువ ధరల కారణంగా కొన్నామని చెప్పారు. భారత్ లో తయారయ్యే వస్తువులలో నాణ్యత తక్కువ ఉన్న కారణంగా మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులు కొనవలసి వస్తున్నదని కొందరి అభిప్రాయం. కొన్ని చైనా వస్తువులకు గ్లోబల్ బ్రాండ్ కూడా ఉన్నది. ఈ సర్వే నివేదిక ఈ రోజు బయటకు వచ్చింది.
రెండవవేవ్ లో చైనా నుండి పెరిగిన దిగుమతులు
భారత్ లో చైనా వస్తువుల బహిష్కరణ కోన సాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021 జనవరి-మే నెలల్లో 42 శాతం పెరిగింది. ఆ దిగుమతులలో COVID- 19 రెండవ వేవ్ సమయంలో వైద్య పరికరాలు మరియు ఆక్సిజన్ చైనా నుండి మరియు ప్రపంచంలోని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. మొత్తం మీద భారత్ లో చైనా వస్తువుల వినియోగం గతం కంటే చాల తగ్గింది