జూన్ 20వ తేదీని ”ప్రపంచ విద్రోహుల దినం”గా ప్రకటించాలని కోరుతూ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఐక్యరాజ్యసమితికి లేఖరాశారు. 2022 జూన్లో ఆ రోజున ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని బీజేపీ కుట్రతో పడగొట్టిందని ఆ లేఖలో పేర్కొన్నారు. నాడు 40మంది శివసేన ఎంపీలను రెచ్చగొట్టి వీడేలా చేసిందని ఆయన ఆరోపించారు. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కు లేఖ రాశారు రౌత్. ఆ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు తీసుకున్నట్టు అందులో ఆరోపించారు. కూటమి సర్కారును కూల్చేందుకు బీజేపీ అన్ని శక్తియుక్తులు ఉపయోగించిదని…ప్రస్తుతం సీఎంగా ఉన్న ఏక్ నాథ్ షిండే సహా 40మంది బీజేపీ అండతోనే వెన్నుపోటు పొడిచారని… తరువాత మరో పదిమంది కూడా పార్టీని వీడారని ఆంటోనియో దృష్టికి తీసుకెళ్లారు. థాకరే అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో బీజేపీ ఆ స్థితిని అడ్వాంటేజ్ గా తీసుకుని కుట్ర పన్నిందనీ రౌత్ అన్నారు. షిండే సహా ఎమ్మెల్యేలందర్నీ బీజేపీ గుజరాత్ తరలించిందని గుర్తు చేశారు. ఈ ప్రక్రియ అంతా జూన్ 20న మొదలైందని..అందువల్ల ఈ రోజును విద్రోహదినంగా ప్రకటించాలని కోరారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయంతోనే జూన్ 21 ని ప్రపంచమంతా యోగా దినోత్సవం జరుపుకుంటోందని…అలాగే 20న విద్రోహదినం నిర్వహించేలా పిలుపునివ్వాలని కోరారు. విద్రోహుల గురించి నాటి దుశ్చర్య గురించి అందరూ తెలుసుకునేలా ఈ నిర్ణయం తీసుకోవాలని ఐరాస సెక్రటరీ జనరల్ కు రాసిన లేఖలో కోరారు సంజయ్ రౌత్.
https://twitter.com/rautsanjay61/status/1670969440987676672?s=20