డిల్లీతో ప్రస్థానం మొదలుపెట్టి పంజాబ్ లోనూ పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ…గుజరాత్ లో ఉనికి చాటుకుంది. మొదటిసారి 5 స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు గెలిచారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే 13 శాతం ఓట్లను ఆ పార్టీ సంపాదించింది. అయితే గుజరాత్ లో ఆప్ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. బీజేపీ ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉండగా.. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆప్ వైపు మళ్లినట్టు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని స్థానాల్లో ఆప్ రెండో స్థానంలో ఉండడం విశేషం. హిమాచల్ ప్రదేశ్లోనూ ఆప్ పోటిచేసింది కానీ అక్కడ పార్టీ ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది.ఇక నాలుగురాష్ట్రాల్లో పోటీ ద్వారా 6శాతం ఓట్లను పొందిన ఆప్ జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది.