
file photo
బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లారు మేడ్చల్ డీసీపీ సందీప్. తన భర్త హత్యకు కుట్ర చేస్తున్నారని…ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సుపారీ ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన భర్త విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆయన భద్రతపై ఆరాతీసింది ప్రభుత్వం.
ఈ మేరకు మంత్రి కేటీఆర్…డీజీపీ అంజనీ కుమార్ తో మాట్లాడారు. ఆయన భద్రతా వ్యవహారాలపై వివరాలు కోరినట్టు తెలిసింది. డీజీపీ ఆదేశంతో మేడ్చల్ డీసీపీ సందీప్ షామీర్ పేటలోని ఈటల ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఈటల దంపతులు ఇంట్లో లేరు. హన్మకొండలో ఓ కార్యక్రమంతో పాటు… ఇటీవలే చనిపోయిన తన అనుచరుడి పెద్దకర్మ కార్యక్రమాల కోసం ఈటల తన నియోజకవర్గానికి వెళ్లారు. జమున కూడా తన ఆఫీసుకు వెళ్లినట్టు తెలిసింది. అయితే డీసీపీ ఈటలతో ఫోన్లో మాట్లాడినట్టు కూడా సమాచారం. ఇక కేంద్రం కూడా ఈటలకు వై కేటగిరీ భద్రతను పెంచుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటిరెండురోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉది.
ఈటల ఇంటికి డీసీపీ – ఆయన భద్రతపై ప్రభుత్వం ఆరా
file photo
బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లారు మేడ్చల్ డీసీపీ సందీప్. తన భర్త హత్యకు కుట్ర చేస్తున్నారని…ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సుపారీ ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన భర్త విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆయన భద్రతపై ఆరాతీసింది ప్రభుత్వం.
ఈ మేరకు మంత్రి కేటీఆర్…డీజీపీ అంజనీ కుమార్ తో మాట్లాడారు. ఆయన భద్రతా వ్యవహారాలపై వివరాలు కోరినట్టు తెలిసింది. డీజీపీ ఆదేశంతో మేడ్చల్ డీసీపీ సందీప్ షామీర్ పేటలోని ఈటల ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఈటల దంపతులు ఇంట్లో లేరు. హన్మకొండలో ఓ కార్యక్రమంతో పాటు… ఇటీవలే చనిపోయిన తన అనుచరుడి పెద్దకర్మ కార్యక్రమాల కోసం ఈటల తన నియోజకవర్గానికి వెళ్లారు. జమున కూడా తన ఆఫీసుకు వెళ్లినట్టు తెలిసింది. అయితే డీసీపీ ఈటలతో ఫోన్లో మాట్లాడినట్టు కూడా సమాచారం. ఇక కేంద్రం కూడా ఈటలకు వై కేటగిరీ భద్రతను పెంచుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటిరెండురోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉది.
Share: