పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు తేదీ మారింది. గురు రవిదాస్ జయంత్యుత్సవాల నేపథ్యంలో పోలింగ్ తేదీని మారుస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. షెడ్యూల్లో ముందు ప్రకటించిన ఫిబ్రవరి 14 కాక ఫిబ్రవరి 20న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఏటా ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటారు. ప్రతి ఏడూ పెద్దసంఖ్యలో భక్తులు పంజాబ్ నుంచీ వేడుకలు జరిగే యూపీలోని వారణాశికి వెళ్తుంటారు. దాదాపు వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఫిబ్రవరి 16 కు ముందు నుంచే పంజాబ్ నుంచి తరలి వెళ్తుంటారు. అందుకని ఫిబ్రవరి 14 న కాక ఫిబ్రవరి 18 తరువాత ఎన్నిక నిర్విహంచాలని కోరుతూ ప్రధాన పార్టీలన్నీ ఈసీకి లేఖ రాశాయి. దీంతో ఎన్నిక తేదీని మార్పు చేస్తూ ఫిబ్రవరి 20న పోలింగ్ ఉంటుందని ఈసీ ప్రకటించింది. పంజాబ్ లో ఒకే దశలో ఎన్నిక జరగనుంది.