శ్రీలంకలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ను గుర్తించారు. ఇది గాలి ద్వారానూ వ్యాపించగలదని జయవర్దెనాపురె యూనివర్సిటీ శాస్త్రవేత్త నీలికా మాలవిగె అన్నారు. ఇది కరోనా అన్ని స్ట్రెయిన్ల కంటె అత్యంత ప్రమాదకరమైనది, అత్యంత వేగంగా వ్యాపిస్తుందని ఆమె హెచ్చరించారు. ఏప్రిల్ 14న శ్రీలంక నూతన సంవత్సర వేడుకలు జరిగినప్పటి నుంచే ఈ కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడ్డాయని శ్రీలంక అధికారులు సైతం అంగీకరించారు. అంతకుముందు దేశంలో
రోజూ సగటున 150 దాకా కరోనా కేసులు నమోదైతే…కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి ప్రారంభమయ్యాకు రోజూ 600 పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీని బారిన పడుతున్న వారిలో ఎక్కువగా యువతే అని వైద్యులంటున్నారు. మరో రెండు ఇంక్యుబేషన్ పీరియడ్లు పూర్తవగానే దేశంలో కరోనా మూడో వేవ్ ప్రారంభం కావచ్చ హెచ్చరికలతో
శ్రీలంక ఆరోగ్యశాఖ కొత్త కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది.