తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారింది . నిత్యం కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలూ పెరుగుతున్నాయి. తాజాగా అంటే గత 24 గంటల్లో తెలంగాణలో 7 వేల 432 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కరోనా వైరస్ నుంచి 2 వేల 152 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 58 వేల 148 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 87 వేల 106కు చేరుకోగా..మరణించినవారి సంఖ్య 1961కు చేరుకుంది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.1 శాతమైతే తెలంగాణలో 0.51గా ఉంది. ఇక కరోనా నుంచి కోలుకున్నవారు 86 శాతం ఉన్నారు. ఇక 24 గంటల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 1464 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 606 కేసులు, రంగారెడ్డిలో 504, నిజామాబాద్ జిల్లాలో 486 కేసులున్నాయి. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాత్రివేళల్లో కర్ఫ్యూ అమలు చేస్తోంది