భారతీయ జనతా పార్టీ (బిజెపి) మాజీ అధికార ప్రతినిధి నూపుర్కు మద్దతుగా కన్హయ్య లాల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్కు వ్యతిరేకంగా జూన్ 28న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో హిందూ టైలర్ కన్హయ్యా లాల్ (Kanhaiya Lal) తల నరికివేసి దారుణంగా హత్యచేశారు ఈ హత్య అనుకోకుండా జరగలేదు, జరిగిన పరిణామక్రమము చూస్తే కన్హయ్య లాల్ నూపుర్కుమద్దతుగా సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్కు వ్యతిరేకంగా అతని పొరుగున ఉన్న నజీమ్ ఫిర్యాదుమేరకు పోలీసులు కన్హయ్య లాల్ను అరెస్టు చేశారువారం రోజులు జైలు లో ఉంచారు .,బెయిల్పై బయటకు వచ్చినతరువాత వరసగా బెదిరింపులు ప్రారంభమైనాయి హత్య చేసిన నజీమ్తో సహా 5-7 మంది వ్యక్తులు దుకాణాన్ని నిరంతరం రెక్కీ చేయడం పై కన్హయ్య లాల్ పోలీసులకు పిర్యాదు కూడా చేసాడు దానిపై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న వారిని పట్టుకోకుండా, వారిని పిలిచి రాజీ ఒప్పందం కుదిర్చారు. ముస్లింల వత్తిడి కారణంగా చట్టపరమైన చర్యలు అక్కర్లేదని కన్హయ్య లాల్ అదే రోజు మరో దరఖాస్తును సమర్పించాడు . ప్రాణభయంతో కన్హయ్య లాల్ తన దుకాణాన్ని ఆరు రోజులు మూసి ఉంచాడు. చివరకు దుకాణం తెరచిన రోజు మహమ్మద్ రియాజ్ అక్తర్ మరియు మహ్మద్ గోస్ అనే ఇద్దరు ఇస్లామిస్టులు అతని కస్టమర్లుగా నటించి అతన్ని దారుణంగా హత్య చేశారు,ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి . ఉదయ్పూర్లో మంగళవారం పట్టపగలు జరిగిన ఈ దారుణానికి సంబంధించిన నిందితులు రెండు వీడియోలు విడుదల చేసారు వాళ్ళు విడుదలచేసిన రెండో వీడియోలో ఇద్దరు నిందితులు తమ చేతుల్లోని కత్తులు చూపుతూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ బెదిరించారు. అందులో ఓ వ్యక్తి..”‘నా పేరు మహమ్మద్ రియాజ్ అక్తర్. నా పక్కన ఉన్నది ఘోష్ మహమ్మద్ భాయ్ (మహ్మద్ ఘోష్). ఉదయ్పూర్లో ఒకరి తల నరికేశాం. ఏయ్.. నరేంద్ర మోదీ, విను నిప్పు నువ్వు రాజేశావు. మేం ఆర్పుతాం. ఇన్షా ఆల్లా.. ఈ కత్తి నీ మెడ దాకా కూడా వస్తుంది. ఉదయ్పూర్ వాస్తవ్యులారా.. ఇప్పుడు ఒక్కటే నినాదం. తప్పు చేస్తే తల తెగిపడుతుంది”అని వ్యాఖ్యానించాడు.ఇదంతా చూస్తూఉంటే దీనివెనక పెద్దకుట్ర ఉండి ఉండవచ్చు అని అనిపిస్తున్నది.
ఇద్దరు ప్రధాన నిందితులను ఘటన జరిగిన రెండు మూడు గంటల్లోపే అరెస్టు చేసింది. అయితే ఉగ్రవాద చర్యగా అనుమానిస్తున్న ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పాకిస్థాన్తో సంబంధాలు: భారత్లో ఎప్పుడు ఉగ్రవాద ఘటనలు జరిగినా పాకిస్థాన్తో సంబంధాలు ఉండటం సాధారణంగా మారింది. ఇప్పుడు ఉదయ్పుర్లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్యకు కూడా పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల్లో ఒకడైన గౌస్ మహమ్మద్కు పాకిస్థాన్తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు రాజస్థాన్ హోంమంత్రి రాజేంద్ర యాదవ్ వెల్లడించారు. అతడు 2014-15లో కరాచీలో 45 రోజుల పాటు ఉగ్రశిక్షణ తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2018-19లో అరబ్ దేశాలకు కూడా వెళ్లినట్లు చెప్పారు. గతేడాది నేపాల్లో ఉన్నట్లు తెలిసిందన్నారు. పాకిస్తాన్(Pakistan) కేంద్రంగా పనిచేస్తున్న మతఛాందస్సవాద ఉగ్రసంస్థ(Terror Outfit)కు చెందిన స్లీపర్ సెల్స్(Sleeper cells) పనేనని ఇంటెలిజెన్సీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఏ సంస్థకు చెందినవారో పేరు వెల్లడించకపోయినప్పటికీ ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశాయి. కాగా ఈ కిరాతక హత్యకు సంబంధించి మరో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు సమాచారం. 10 మందికిపైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ హత్య వెనుక. ఏదైనా ఉగ్రవాద సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ కుట్ర కోణం విచారించాలని ఎన్ఐఏను కేంద్రం హోం శాఖ ఆదేశించింది.
రాజస్థాన్ లో లాగానే మహారాష్ట్రలో కూడా జూన్ 22న మరొహత్య దారికాసి మరి చేసారు మహారాష్ట్రలోని అమరావతిలో నివసిస్తున్న రసాయన శాస్త్రవేత్త ఉమేష్ కోల్హే జూన్ 22 రాత్రి తన ఫార్మసీ నుండి తిరిగి వస్తుండగా నలుగురు ముస్లిం దుండగులు దాడి చేసి హత్య చేశారు. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, సోషల్ మీడియాలో నూపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేసినందుకె కోల్హే హత్యకు గురయ్యారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేయాలని మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి శివరాయ్ కులకర్ణి అన్నారు.
మృతుడు ఉమేష్ కోల్హే (54) అమరావతిలో నివసిస్తున్న రసాయన శాస్త్రవేత్త, అతని హత్యాగురించి అతనికుమారుడు చెప్పిన వివరాలు ప్రకారం . హత్య జరిగిన జూన్ 22న రాత్రి ఉమేష్ కోల్హే తన కొడుకు సంకేత్, కోడలు వైష్ణవితో కలిసి వేర్వేరు బైక్లపై ఇంటికి వెళ్తున్నాడు. ఈ దాడిలో కోల్హే మెడపై వెనుక నుంచి కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో కోల్హే అక్కడికక్కడే మృతి చెందాడు.హత్య చేయబడ్డ ఉమేష్ కోల్హే దగ్గర బాగ్ లో డబ్బులు ఉన్నాయి హంతకులు ఆ డబ్బు జోలికి పోలేదు హత్యకు ముందు వారం రోజులుగా అతడిపై నిఘా పెట్టారని తెలుస్తున్నది. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను స్కాన్ చేయడంతోపాటు నేరం జరిగిన ప్రదేశంలో ఆ సమయంలో యాక్టివ్గా ఉన్న మొబైల్ ఫోన్లను కూడా స్కాన్ చేశారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఇప్పటికే ముదస్సిర్ అహ్మద్ షేక్ ఇబ్రహీం, షారూఖ్ పఠాన్ ఇహయత్ ఖాన్లను పట్టుకోన్నారు.
ఇటువంటి సంఘటనలు దేశంలో అంతర్గత సంఘర్షణలతో దేశంలో భయాందోళనలు సృష్టించటం తమ ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చేస్తుంటారు. ,సంఘటనలు వాటికీ తోడవుతాయి. శతాబ్దాలుగా జరుగుతున్నా ఈ దాడులను కొందరు ఉన్మాదులు పాల్పడే దుశ్చర్యలుగా మాట్లాడుతూ మొత్తం అందరికి అంట కట్టవద్దు అని వామపక్ష మేధావులు ఉదారవాదులుఒక ఉచిత సలహా పడేస్తూ ఉంటారు ఇవి వాళ్ల్లు తమ తప్పులు కప్పిపుచ్చుకొనేందుకు ఉపయోగించుకొంటారు అని చరిత్ర చెబుతున్న సత్యం. హిందూ సమాజం అప్రమత్తం కావలసిన సమయమిది.
~NewsBharatiyam