లోదుస్తుల్లో బంగారం పెట్టి స్మగ్లింగ్ చేస్తున్న కాసర్ గోడ్ కు చెందిన మహిళను కేరళలో ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు.
దాదాపు కోటి రూపాయల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడింది ఆ యువతి. 19ఏళ్ల షహ్లా 1.8 కిలోల బంగారాన్ని చిన్న చిన్న పాకెట్లలో లోదుస్తుల్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తుండగా….కేరళలోని కరిపూర్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. రాత్రి పదిన్నరకు ఆమె దుబాయ్ నుంచి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ లో వచ్చింది. కస్టమ్స్ తనిఖీ తర్వాత రాత్రి 11 గంటలకు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన ఆమెను..రహస్య సమాచారం ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని పరిశీలించగా ఏమీ దొరకలేదు. ఆ తర్వాత మహిళ శరీరాన్ని పరీక్షించి, ఆమె లోదుస్తులకు కుట్టిన బంగారు ప్యాకెట్లను గుర్తించారు. ఆమె వెనక ఏదైనా స్మగ్లింగ్ మాఫియా హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మంగళూరులో కస్టమ్స్ అధికారులు రెండు వేర్వేరు ఘటనల్లో అరెస్ట్ చేశారు. వారినుంచి స్వాధీనం చేసుకున్న 24 క్యారెట్ల బంగారం విలువ 1.366 కోట్లు.
ఇవాళ దొరికిన మహిళ తన శానిటరీ ప్యాడ్లలో స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని తీసుకువెళ్లిందని, అయితే ఇక్బాల్ తన పురీషనాళంలో బంగారాన్ని సెల్యులాయిడ్ ఆధారిత టేప్ , కండోమ్తో చుట్టి నాలుగు బంతులుగా దాచిపెట్టాడని అధికారులు తెలిపారు.
అటు పెద్దఎత్తున బంగారం స్మగ్లింగ్ జరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 2020లో దేశవ్యాప్తంగా కస్టమ్ అధికారుల తనిఖీల్లో పురీషనాళాలనుంచే 15.67 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు.