వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. ఎక్కువగా సున్నితమైన ప్రాంతాలు ఉండటం ఓ కారణం అయితే.. మరికొన్ని చోట్ల నాటు బాంబులతో దాడులు, క్రూడ్ బాంబుల కలకలం స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈసీ రాష్ట్రంలో ఎనిమిది విడుతల్లో ఎన్నికలను నిర్వహిస్తోంది. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు ముగియగా.. మూడో దశ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ 24 పరగణ జిల్లాలో పెట్రోల్ బాంబులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని బరైపూర్లోని ఓ చెట్ల పొదల్లో దాదాపు 41 క్రూడ్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్ట్ చేయలేదని.. ఎవరు ఈ బాంబులను ఇక్కడికి తీసుకువచ్చారన్న దానిపై దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరగకుండా అడ్డుకునేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్లాన్ వేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
In a raid held in Baruipur's Padmapukur area, 41 crude bombs were recovered from a bush, yesterday. Case registered, no arrest has been made yet, probe is on: District Election Officer, South 24 Parganas, West Bengal pic.twitter.com/OsyAAeYM57
— ANI (@ANI) April 3, 2021