సుశిక్షితులైన సీఆర్పీఎఫ్ కు చెందిన తొలి మహిళా కమెండో బృందం ఇక విధుల్లోకి చేరనుంది. మొత్తం 32 మందితో కూడిన దళం రంగంలోకి దూకుతోంది. జనవరి నుంచి వీరంతా విధుల్లో చేరుతారని సమాచారం. జెడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి ముందుగా ఈ మహిళా కమోండోలను రొటేషన్ పద్ధతిలో నియమించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీ , సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు తదితరుల రక్షణ బాధ్యతను వారికి అప్పగించనున్నారు. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు వెంట ఉంటారు. వారు బసచేసిన చోట తనిఖీ బాధ్యతలు వీరివే. వారు ఇంట్లో ఉన్నప్పుడు వారి రక్షణ, నిఘా బాధ్యతలు చూస్తారు.
ఆయుధాలు లేకుండానే శత్రవులతో పోరాడడం వీరి ప్రత్యేకత. ప్రత్యేక ఆయుధాలు వాడుతారు. డేగకళ్లతో చుట్టూ చూస్తూ వీవీఐపీలకు పొంచి ఉన్న ముప్పును పసిగట్టడం వంటి వాటిల్లో కఠోర శిక్షణ పొందారు.