భద్రతా బలగాలను చంపేందుకు నక్సల్ చేసిన ప్రయత్నాలను సీఆర్పీఎఫ్ ఛేధించింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయన్న విషయం తెలిసి.. నక్సలైట్లు ఐఈడీ మందుపాతరలను అమర్చారు. మొడిపారా ప్రాంతంలో 8కిలోల ఐఈడీ బాంబులను అమర్చారు. అయితే ఈ మందుపాతరను సీఆర్పీఎఫ్ 85 బెటాలియన్ గుర్తించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన బాంబ్స్క్వాడ్.. 8కిలోల ఐఈడీ మందుపాతరను గుర్తించి.. నిర్వీర్యం చేశారు. సదరు మందుపాతరను పేల్చేస్తున్న సమయంలో సీఆర్పీఎఫ్ టీం వీడియో తీసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH: CRPF 85 Battalion in Cherpal neutralised an 8-kg IED, planted by naxals, in a controlled explosion in a forest in Bijapur today. The IED was found in Modipara, near Cherpal in Chhattisgarh. pic.twitter.com/7Jy9qEFjgH
— ANI (@ANI) April 3, 2021