భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ భద్రత విషయంలో వైఫల్యాలున్నాయన్న కాంగ్రెస్ ఆరోపణల్ని సీఆర్పీఎఫ్ ఖండించింది. ఆయనే పదేపదే భద్రతానియమావళి ఉల్లంఘించారని పేర్కొంది. ఇప్పుడు మాత్రమే కాదు…2020నుంచి మొత్తంగా 113 సార్లు రాహుల్ సెక్యూరిటీ ప్రొటోకాల్ ను ఉల్లంఘించారంది.
CRPF denies Congress' claims about security breach in Rahul Gandhi's Bharat Jodo Yatra.
When the protectee himself violates the protocols, he is undermining our security personnel: @Shehzad_Ind
I have myself seen negligence on part of the Delhi police: @Dr_Uditraj pic.twitter.com/Egq7s44ZEB
— TIMES NOW (@TimesNow) December 29, 2022
భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనకు కల్పిస్తున్న సెక్యూరిటీపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆరోపణలూ చేసింది. జెడ్ + స్థాయి సెక్యూరిటీ కల్పించాల్సిన వ్యక్తికి పోలీసులు కనీస భద్రత కల్పించడం లేదని పార్టీ మండిపడింది. ముఖ్యంగా ఢిల్లీలో జోడోయాత్ర సందర్భంగా..భద్రతావలయాన్ని నిర్వహించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందాలనీ ఆరోపించింది.అయితే పార్టీ ఆరోపణలపై సెంట్రల్ రిజర్వ్డ్ ఫోర్స్ ఘాటుగానే స్పందించింది. ఢిల్లీలో భారత్ జోడో యాత్ర సందర్భంగా భద్రతాప్రమాణాలు పక్కాగా పాటించామని రాహుల్ గాంధీనే పదే పదే ఉల్లంఘించారని అంది. డిసెంబర్ 22నే అంటే రాహుల్ యాత్ర రాజధానికి చేరుకునే రెండురోజుల ముందే…ఈ విషయమై తాము ప్రత్యేక సమావేశం నిర్వహించామని ..తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. అయితే సంబంధిత వ్యక్తులు వారి భద్రతకు సంబంధించి మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని…కానీ …రాహుల్ అందుకు సహకరించడం లేదన్నారు. భద్రతాప్రమాణాలు ఉల్లంఘిస్తున్న ప్రతిసారీ ఆ విషయాన్నీ ఆయన దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తున్నా ఫలితం ఉండడంలేదన్నారు. ఇక ఇక సున్నితమైన పంజాబ్, జమ్ముకశ్మీర్ లో యాత్ర సందర్భంగానైనా భద్రతను పెంచాలని ఏఐసీసీ కార్యదర్శి హోంమంత్రి అమిత్ షాకు లేఖరాశారు. రాజధానిలో జోడోయాత్ర కోసం…కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని డిల్లీ పోలీసులు, ఇతర ఏజెన్సీల సమన్వయంతో సీఆర్పీఎఫ్ భద్రతా ఏర్పాట్లు చేసింది.
Delhi leg of Bharat Jodo Padyatra for 24th December ASL involving all stakeholders was conducted on Dec 22. All security guidelines have been strictly followed and Delhi Police has informed that sufficient deployment of security personnel was made: CRPF
— The Times Of India (@timesofindia) December 29, 2022