సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం ప్రధాని మోదీకి తెలిసినట్లు మరెవరికి తెలియదు. జనవరి 26, 2001లో గుజరాత్ లో అసలే అతి వెనుక బడి ఉన్న ప్రాంతంగా చెప్పుకునే కఛ్ లో భూకంపం తరువాత ఒక్క గోడ కూడా లేకుండా సుమారు అన్ని ఇళ్లు నేల మట్టం అయిపోయాయి.. నిరాశావాదులు, జాతీయ అంతర్జాతీయ మీడియా ఆ విధ్వంసం చూసి కచ్ ఇక మళ్ళీ కొన్ని దశాబ్దాలలో కోలుకునే అవకాశం లేదు అని తేల్చేశారు
అప్పుడే పార్టీ జనరల్ సెక్రటరీ గా ఉన్న మోడీకి కచ్ బాధ్యతలు అప్పచెప్పింది బిజెపి. ఆ ఏడాది చివరిలో… గతంలో ఏ పరిపాలనా అనుభవం లేని మోదీ మొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు.
మిగతా ముఖ్యమంత్రులు లాగా మోదీకి మొదటి ఏడాది హనీమూన్ పీరియడ్ కాదు… కచ్ పునర్నిర్మించ వలసిన బాధ్యత పడింది. ఇటువంటి సమయాల్లో సాయం చేయడానికి ఇప్పుడు ఉన్న కేంద్ర NDRF అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లేదు. ముఖ్యమంత్రి గా తానే ప్లాన్ చేసుకున్నారు. ఇటువంటి ఉపద్రవాలు వస్తే ప్రభుత్వం ఏ ప్రణాళికలు ద్వారా దీన్ని ఎదుర్కోవాలి వంటి చాలా అంశాలను పొందు పరుస్తూ దేశంలో మొదటి సారిగా 2003 లో గుజరాత్ రాష్ట్రం డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ మీద ఒక చట్టం చేసింది. యూపీఎ సమయంలో NDMA చట్టం NDRF రావడానికి ఈ గుజరాత్ చట్టమే ప్రేరణ, ఆధారం.
అన్నిటి కన్నా పెద్ద ఇబ్బంది అన్ని వేల మంది ప్రజలకు తలదాచుకునే ఏర్పాట్లు…ఇళ్ళు లేవు. వెంటనే నిర్మించడానికి తగినంత పనివారు లేరు. అందుకే అక్కడ ఉన్న ప్రజలనే కమిటీలుగా ఏర్పాటు చేసే ఇళ్ల నిర్మాణం బాధ్యత వారికే అప్పచెప్పారు.
ఇళ్లు పూర్తయ్యాయి. కానీ కచ్ పక్కనే అంతా ఎడారి ప్రాంతం , పాకిస్థాన్ బోర్డర్ కూడా. జీవనోపాధి అవకాశాలు బాగా తక్కువ. అందుకే అక్కడ నీటి పారుదల రంగంపై దృస్థిపెట్టారు. నర్మదా నది నీటిని కాలువలు ద్వారా మళ్లించారు. ఎందుకూ పనికిరాని బీడు భూములు అనుకున్న ప్రదేశాల నుంచి ఒక పదేళ్ల కాలంలో ఖర్జూరం, మామిడి , దానిమ్మ విస్తారంగా పండసాగాయి. ఎగుమతులు కూడా మొదలుపెట్టారు.
అంతే కాక తరువాత హైవే రోడ్ లు, గ్రామాలకు రోడ్లు నిర్మాణాల మీద దృస్థి పెట్టడంతో ఎప్పుడూ అక్కడకి రాని పాల కేంద్రాలు పాల సేకరణ కేంద్రాలు రావడం ప్రారంభం అయింది.
కచ్ బాగా వెనుకబడిన ప్రాంతం. టూరిస్టులు చూడడానికి కూడా ఏదీ లేదు. అందుకే ఇటువైపు ఎవరూ వచ్చేవారు కాదు. పై ప్రాంతాల వారు ఇటు వచ్చి ఖర్చు చేస్తే ఇక్కడ ప్రజలు ఆదాయాలు పెరుగుతాయి అని భావించి
అక్కడ దగ్గర్లో ఉప్పుతోనిండిన ఎడారి ప్రాంతం వంటిది ఉంటే దానినిఒక పెద్ద టూరిస్ట్ కేంద్రంగా మార్చారు.
అసలు టూరిస్టులు ఎప్పుడూ రాని ప్రదేశానికి 2018 అయ్యేసరికి 15 లక్షల మంది దేశ విదేశీ యాత్రికులు వచ్చారు. స్థానికంగా చేతి వృత్తులు, హస్త కళలు నైపుణ్యం గలవారు ఎక్కువ ధరలకు తమ వస్తువులు అమ్ముకునే అవకాశం పొందారు.
1993 లో మహారాష్ట్ర లో లాతూర్ లో ఇలాగే పెద్ద భూకంపం వచ్చి సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు కచ్ లాతూర్ పోల్చి చూడండి.
అక్కడ పరిస్థితి ఇలా ఉంటే విదేశీనిధులతో నడుస్తున్న ఇక్కడి ఓ మీడియా సంస్థ ఇటీవలే ఓ ఆర్టికల్ ప్రచురించింది.. గుజరాత్ లో కచ్ ప్రాంతం భూకంపం తరువాత ఊహించలేని విధంగా అభివృద్ధి చెందింది అని రాస్తూ దానికి అధికారులే కారణం అని రాసాడు. అప్పటి ముఖ్యమంత్రి మోదీ ప్రస్తావనే అందులో లేదు..అంతద్వేషం వారికి భారత ప్రధాని అంటే.