ఢిల్లీలో దారుణం జరిగింది. కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న యువతిని దారుణంగా చంపాడో దుర్మార్గుడు. పొడిచి చంపి, శరీరాన్ని ముక్కలు గా కోసి డిల్లీ అంతటా విసిరేశాడు. అతన్ని అఫ్తాబ్ అమీన్ గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఘటన ఐదునెలల క్రితం జరగ్గా…ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
26 ఏళ్ల శ్రద్ధ, ఆఫ్తాబ్ అమీన్ కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. కొన్నిరోజులుగా తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా శ్రద్ధ అతనిపై ఒత్తిడి తీసుకువస్తోంది. ఈ విషయంపైనే ఇద్దరు తరచూ గొడవపడేవారు. మే 18న మరోసారి గొడవజరగ్గా ..అప్పుడే శ్రద్ధ గొంతు నులిమి చంపాడు అమీన్.
తరువాత పదునైన ఆయుధంతో శరీరాన్ని ముక్కలుగా కోసి… డిల్లీలో పలుప్రాంతాల్లో తిరుగుతూ ముక్కలు పారేశాడు.
నవంబర్ 8న శ్రద్ధ తండ్రి వికాస్ మదన్ మెహ్రౌలీ పోలీసు స్టేషన్లో కుమార్తె కిడ్నాపైందని.. కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఓ కాల్ సెంటర్లో పనిచేసే సమయంలో అమీన్ అఫ్తాబ్ తో పరిచయం ఏర్పడిందని..వద్దంటున్నా వినకుండా అతనితో ఉంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రద్ధను హత్య చేసింది తానేనని అంగీకరించాడు ఆఫ్తాబ్.
https://twitter.com/ANI/status/1592057061323714560?s=20&t=Mf-fwaXC6_HTISKAVLhH1w