జార్ఖండ్ లో విద్యుత్ కోతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్రికెటర్ ధోనీ భార్య సాక్షిసింగ్ ట్విట్టర్ వేదిగ్గా పోస్ట్ చేసింది. రాష్ట్రంలో కొంతకాలంగా విద్యుత్ సంక్షోభం ఉందని..అందుకు కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నట్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సాక్షి. ఓ టాక్స్ పేయర్ గా అడుగుతున్నానని ప్రభుత్వాన్ని నిలదీసిందామె.
https://twitter.com/SaakshiSRawat/status/1518614210703691776?s=20&t=3GcaRpY98HCmxtCH7dEwsA
సాక్షికి మద్దతుగా నెటిజన్లు వచ్చారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రోజుకు 12-16 గంటల పాటు విద్యుత్ కోత ఉంటోందని గుర్తు చేశారు. దానిపై అధికారులకూ పలుమార్లు ఫిర్యాదులు చేశామంటూ కొందరు నెటిజన్లు షేర్ చేసుకున్నారు. ఆమె ఒక్క ట్వీట్ కు వందలమంది నెటిజన్లు స్పందించారు. తమ అభిప్రాయాలు చెప్పారు.
https://twitter.com/Alok_Prasoon/status/1518775796172611585?s=20&t=mFVhbPo4jPMRHsMzqxVi-Q
https://twitter.com/tweet_ashim/status/1518651962136268800?s=20&t=uihvn3XX-HTXWwSN_Od4fA
విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు సంక్షోభం కారణంగా జార్ఖండ్లో విద్యుత్ సంక్షోభం ఉంది. దీని కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో లోడ్ షెడ్డింగ్ జరుగుతుంది. లోడ్ షెడ్డింగ్ అంటే ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి ఇతర ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిర్ధారించడం. గత వారం రాంచీ, జంషెడ్పూర్ వంటి నగరాలు మినహా అనేక ప్రాంతాలలో చాలా గంటలు విద్యుత్ కోత ఏర్పడింది. రాంచీలో ధోని కుటుంబం ఉంది, ఇప్పుడు విద్యుత్ సంక్షోభం రాష్ట్ర రాజధానికి కూడా చేరుకుంది.
మార్చిలో రాష్ట్రంలోని మూడు విద్యుత్ ప్లాంట్లు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సంక్షోభానికి దారితీశాయి. అప్పట్లో ధన్బాద్, జంషెడ్పూర్, లోహర్దగా, గుమ్లా సహా పలు జిల్లాల్లో 10-12 గంటల పాటు లోడ్ షెడ్డింగ్ చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)