నా కూతురు జోసినా మేరీ జోసెఫ్ ని సీపీఎం విద్యార్థి సంఘ (DYFI) నాయకుడు షాజిన్ లవ్ జిహాద్ లో ట్రాప్ చేసాడు. కాపాడండి అని కేరళ హై కోర్ట్ లో సీపీఎం జిల్లా నేత హెబియస్ కార్పస్ పిటిషన్ వేసాడు.
న్యాయమూర్తులు వీజీ అరుణ్, సీఎస్ సుధలతో కూడిన డివిజన్ బెంచ్, మేరీ తన స్వంత ఇష్టానుసారమే ఈ బంధంలో ప్రవేశించింది అని, వివాహ చట్టం నిబంధనల ప్రకారం ఈ వివాహానికి సంబంధించిన నోటీసును కూడా ఇప్పటికే సమర్పించింది అని కోర్టు పేర్కొంది
“మేము ఆమెతో సంభాషించాము. షెజిన్తో తాను ఇష్టపూర్వకంగానే కలిశానని ఎలాంటి బలవంతం కింద కాదని ఆమె స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుతానికి తన తల్లిదండ్రులతో సంభాషించడానికి ఆసక్తి లేదని తనకి ఆసక్తి లేదు అని మేరీ పేర్కొంది. కావలనిపిస్తే తల్లిదండ్రులతో భవిష్యత్తులో మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడను అని చెప్పింది.
ఆమె ప్రపంచాన్ని చూసిన 26 ఏళ్ల వ్యక్తి. ఆమె విదేశాల్లో పని చేసి తిరిగి వచ్చింది. ఆమె తన సొంత నిర్ణయం తీసుకోగల సమర్థురాలు’’ అని జస్టిస్ అరుణ్ వ్యాఖ్యానించారు. ఈ కారణాలు వల్ల ఈ కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు అని మేరీ తండ్రి వేసిన పిటిషన్ని కొట్టేసింది.
సీపీఐ(ఎం)లోని ఓ జిల్లా నాయకుడు షెజిన్పై ఆరోపణలు చేయడంతో మరియు పాలక సీపీఐ(ఎం) యువజన విభాగం డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) సభ్యుడు అయిన ముస్లిం వ్యక్తికి క్రిస్టియన్ మహిళకు మధ్య ఏర్పడిన సంబంధం “లవ్ జిహాద్” ఆరోపణలు తో హాట్ టాపిక్ గా మారింది.
నన్స్ తో సహా క్రైస్తవ సమాజం ఈ జంట సంబంధానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించింది.
సీపీఐ(ఎం) జిల్లా నాయకత్వం జోక్యం చేసుకుని, మతాంతర వివాహాలను పార్టీ ఎప్పుడూ ‘లవ్ జిహాద్’గా పేర్కొనలేదని, తమ ప్రకటనను తప్పుగా అన్వయించారని వివరణ ఇచ్చుకుంది.
~ చాడా శాస్త్రి