చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అథారిటీ సీపీఈసీని రద్దు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగా అభివర్ణిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళికామంత్రి అషన్ అక్బాల్. 2019 లో ఇమ్రాన్ ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల (60 బిలియన్ డాలర్లు)తో సీపీఈసీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. చైనాలోని షిన్జియాంగ్ ప్రావిన్సు నుంచి పాక్లోని బలూచిస్థాన్ ప్రావిన్సు పరిధిలో ఉన్న గదర్ ఓడరేవు మధ్య మౌలిక సదుపాయాలు, ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు దీని లక్ష్యం. ఇప్పటికే సగం వ్యయం చేసినట్టు చైనా చెప్తుంటే అథారిటీని రద్దు చేసింది కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం.
కాగా, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు పటిష్ఠ భద్రత కల్పించాలంటూ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖను ఆదేశించారు. అటు ఇమ్రాన్ తన మద్దతుదారులతో లాహోర్లో సమావేశం అయ్యారు. ఆ సభకు ముప్పు ఉన్నట్టు సెక్యూరిటీ ఏజెన్సీల హెచ్చరిక నేపథ్యంలో వర్చువల్ గా సభ నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే అందుకు ఇమ్రాన్ ఒప్పుకోలేదు. దీంతో ఆయన రక్షణకు తక్షణం పటిష్ట చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది పీఎంవో.