ప్రముఖ దర్శకుడు మణిరత్నం కరోనాతో ఆస్పత్రిలో జాయినయ్యారు. అస్వస్థతకు గురైన ఆయనకు టెస్ట్ చేయించగా పాజిటివ్ గా తేలింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని అపోలో ఆస్పత్రిలో చేర్చాడు. ఈవిషయం తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని… ఇవాళ ఆయన పరిస్థితిపై ఆయన భార్య సుహాసిని ప్రకటన చేస్తారని తమిళమీడియో పేర్కొంది.
ఆయన దర్శకత్వం వహించిన చారిత్రిక నేపథ్య చిత్రం చోళ సామ్రాజ్యం బ్యాగ్రౌండ్తో ‘పొన్నియన్ సెల్వన్-1’ సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఆయన బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జూలై 8న పొన్నియన్ సెల్వన్ టీజర్ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకిఉండవచ్చని అనుకుంటున్నారు.