కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ కోవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ, కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జైరామ్ రమేశ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. వైద్య పరీక్షల్లో సోనియాకు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని.. ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఆమె ఐసొలేషన్లో ఉన్నారని ఆయనన్నారు. జూన్ లో ఆమె కరోనా బారినపడిన సంగతి తెలిసిన విషయమే. ఆ సమయంలో కరోనా కారణంగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఆమె ఈడీ ఎదుట హాజరు అయ్యేందుకు గడువు సైతం కోరారు. కరోనాతో ఇబ్బందిపడ్డ ఆమెను గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత జూన్ 20న డిశ్చార్జి అయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. సోనియాగాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకు కూడా బుధవారం కోవిడ్ పాజిటివ్ వచ్చింది.