భారతదేశంలో శనివారం 2,527 తాజా ఇన్ఫెక్షన్లు నమోదవడంతో రోజువారీ కోవిడ్ -19 కేసులు వరుసగా నాల్గవ రోజు 2,000 మార్కును దాటాయి. గత 24 గంటల్లో యాక్టివ్ కోవిడ్ కేసులు 838 పెరిగి 15,079కి చేరాయి. శనివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన డేటా ప్రకారం 33 కోవిడ్ సంబంధిత మరణాలు కూడా నమోదయ్యాయి. భారత్ లో ఈ వారంలో ఇప్పటికే 12,945 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గత వారం అనగా ఏప్రిల్ 17 వరకు 6826 కేసులు నమోదయ్యాయి.
శనివారం రోజువారీ పాజిటివిటీ రేటు 0.56 శాతంగా నివేదించబడింది, అయితే గత వారపు పాజిటివిటీ రేటు 0.50 శాతంగా ఉంది.
నివారం నాటికి 838 యాక్టివ్ కేసులు పెరిగి ఇప్పుడు 15,079కి చేరుకుంది. పది రోజుల క్రితం, ఏప్రిల్ 13 న, యాక్టివ్ కేసుల సంఖ్య 10,870 ఉన్నాయి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)