కరోనా మళ్లీ విజృంభిస్తోంది. భారత్ లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని వారాలుగా పదులు, వందల్లో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ఆదివారం రికార్డు స్థాయిలో 2వేల కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 200 మరణాలు సంభవించాయి. కేరళలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా రెండు లక్షల పైగా మందికి కోవిడ్ టెస్ట్ చేయగా 2 183 మందికి కోవిడ్ ఉన్నట్టు నిర్థారణ అయింది. అత్యధికంగా కేరళలో 940, ఢిల్లీలో 547 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అక వైరస్ విజృంభన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సర్కారు అప్రమత్తమైంది. మాస్కు తప్పని సరి చేస్తూ మరికొన్ని జాగ్రత్తలతో గైడ్ లైన్స్ విడుదల చేసింది.