దేశంలో కరోనా వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తోంది. కొత్తగా 3,207 కరోనా కేసులు నమోదు కాగా, చనిపోయిన వారి సంఖ్య 29కి చేరింది. దేశవ్యాప్తంగా ఇంకా 20,403 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని 3,410 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోవిడ్ వల్ల దేశవ్యాప్తంగా మొత్తం 5,24,243 మంది మృతి చెందారు. ఇంకా వాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటికి 190.34 కోట్ల టీకాలు వేసినట్టు ప్రభుత్వం తెలిపింది.