కోవిడ్ మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వేళ మరో షాకింగ్ న్యూస్. వైరస్ పుట్టిన చైనాలోనే మరోసారి వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. దీంతో మునుపటి రోజులు వస్తాయేమోనని ప్రపంచమే భయపడుతోంది. రాబోయే మూడు నెలల్లో ఆ దేశంలోని 60 శాతం మందికి కోవిడ్ సొకవచ్చంటున్నారు. ఇప్పటికే బాధితులతో చైనాలోని ఆస్పత్రులన్నీ కిక్కిరిపోయాయని సమాచారం. అలాగే ప్రపంచ జనాభాలో పదిశాతం మందికి కోవిద్ సోకవచ్చన్న హెచ్చరికలు ఆందోళన కలిస్తున్నాయి.