కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 21,411 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 4,38,68,476కి చేరుకుంది. కాగా 67 కొత్త మరణాలు నమోదవడంతో మరణాల సంఖ్య 5,25,997కి చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో 2,515 కేసులు, కేరళలో 2,477, పశ్చిమ బెంగాల్లో 2,237, తమిళనాడులో 2,033, కర్ణాటకలో 1,562 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 50.57 శాతం కొత్త కేసులు నమోదవగా, ఒక్క మహారాష్ట్రలోనే 11.75 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 20,726 మంది రోగులు కోలుకున్నారు, దీనితో దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,31,92,379కి చేరుకుంది. భారత్ రికవరీ రేటు 98.46 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 4,80,202 నమూనాలను పరీక్షించారు.