కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ల విషయంలో ఏళ్ల తరబడి ఊగిసలాట కొనసాగుతోందని… అనుకున్నది అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని వ్యాఖ్యానించింది కోర్టు. అయితే అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. తదుపరివిచారణను కోర్టు ఈనెల 25 కి వాయిదా వేసింది. అటు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వ్యతిరేకిస్తూ రైతు కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.