కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశాల ప్రకారం సర్వే చేపట్టారు అధికారులు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ ప్రతిమలపై సర్వే జరపాలని కోర్ట్ ఇదివరకే ఆదేశించింది. వారణాసిలోని మసీదు దగ్గర కోర్టు ఆదేశాల మేరకు మసీదును సర్వే చేయడానికి, వీడియోగ్రఫీ చేయడానికి అడ్వకేట్ కమిషనర్ స్థలానికి చేరుకున్న వెంటనే పెద్దసంఖ్యలో ముస్లింలు వచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వెంటనే భద్రతా సిబ్బంది వారిని అదుపు చేసింది.పరిస్థితి సద్దుమణిగింది అనుకునేంతలో…. మళ్లీ ముస్లింలు పక్క సందునుంచి నినాదాలు చేస్తూ దూసుకువచ్చారు. అక్కడ శుక్రవారం ప్రార్థనల కోసమే వచ్చినట్టు ముందు నమ్మించారు. దాదాపు 6 నుంచి ఏడు వందల మంది ముస్లింలు చాలాసేపు చుట్టుపక్కల సందుల్లో నిలబడి ఉన్నారు.
అయితే సర్వేను నిర్వహించడానికి వచ్చిన అధికారులను ఆపే ఉద్ధ్యేశంతో, ముస్లిమేతరులెవరూ మసీదులోకి ప్రవేశించరాదని అంటూ జ్ఞాన్వాపి మసీదు అంజుమన్ ఇంతేజామియా కమిటీ వ్యతిరేకిస్తోంది.
https://twitter.com/KreatelyMedia/status/1522529667332202496?s=20&t=96XggltY5oWnOdgFwD6c2g
సర్వే, వీడియోగ్రఫీలో కవర్ చేయవలసిన అంశాలలో శృంగర్ గౌరీ విగ్రహం, జ్ఞానవాపి మసీదు ఆవరణలోని శృంగర్ గౌరీకి సంబంధించిన శిథిలాలు, అక్కడి స్తంభాలు వంటివాటిని సర్వే చేసి వీడియోతీయనున్నారు. మసీదు ఉన్న స్థలం అసలైతే కాశీ విశ్వనాథ్, మాతా శృంగార్ గౌరీ ఆలయ కాంప్లెక్స్ లో చాలా ముఖ్యమైన భాగం అని హిందూభక్తులు వాదిస్తున్నారు. మసీదుగా మారిన దేవాలయం రెండు బేస్మెంట్ ల సర్వే ప్రక్రియకు 3 నుంచి 4 రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.
ఈ కేసులో హిందూ పిటిషనర్ల తరఫున కోర్టు కమిషనర్ బృందంలో 15 మంది ప్రాతినిధ్యం వహిస్తారు. అంతేకాకుండా సర్వే, వీడియోగ్రఫీ చేయు సమయంలో కోర్టు కమిషనర్ తోపాటు ఇద్దరు అసోసియేట్లు, ముగ్గురు 3 ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కూడా ఉంటారు. ఐదుగురు న్యాయవాదుల తోపాటు అంజుమన్ ఇంతేజామియా కమిటీకి చెందిన ప్రతివాదులు కూడా హాజరుకానున్నారు. సర్వే నేపథ్యంలో కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణం వద్ద భద్రతను పెంచారు.
https://twitter.com/NikhilCh_/status/1522523215754457090?s=20&t=rnvI9nTohoi2L05lSmEZ9w
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కాశీ విశ్వనాథ్, జ్ఞాన్వాపి మసీదు వివాదం 1991 నుంచి వారణాసి స్థానిక కోర్టులలో పెండింగ్లో ఉంది. హైకోర్టు ఆదేశాల తర్వాత ఆ దావా అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు.
ఆగస్టు 18, 2021న వారణాసికి చెందిన ఐదుగురు మహిళలు శృంగర్ గౌరీ ఆలయంలో రోజువారీ పూజ చేయాలనే డిమాండ్ తోపాటు ఇతర డిమాండ్లతో వారణాసిలోని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులో దావా వేశారు. ఈ పిటిషన్ను అంగీకరించిన కోర్టు అక్కడికక్కడే పరిస్థితిని తెలుసుకునేందుకు న్యాయవాదుల కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆదేశించడమే కాకుండా అడ్వకేట్ కమిషనర్ను కూడా నియమించింది. అంతే కాదు అవతలి పార్టీకి నోటీసులు జారీ చేయడంతోపాటు తదుపరి విచారణ తేదీని కూడా ఖరారు చేశారు. అయితే కోర్టు కమిషనర్ రెండుసార్లు వెనకడుగు వేయడంతో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించలేకపోయారు.
వారణాసి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్ ఫాస్ట్ ట్రాక్) జస్టిస్ రవి కుమార్ దివాకర్, ఆగస్టు 18, 2021 నాటి తన మునుపటి ఉత్తర్వులను పునరుద్ఘాటిస్తూ, 8 ఏప్రిల్ 2022న కోర్టు కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను నియమించడం ద్వారా సర్వే, వీడియోగ్రఫీ ప్రొసీడింగ్లను చేపట్టేందుకు మళ్లీ అనుమతించారు.
ఇందుకోసం మెరుగైన భద్రతా ఏర్పాట్లు అవసరమని.. ముస్లింలు, భద్రతా సిబ్బంది మాత్రమే మసీదు లోపలికి వెళ్లగలరని వారు వాదించారు. విచారణ తర్వాత అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు, దాని మునుపటి ఉత్తర్వును కొనసాగించింది. ఈద్ తర్వాత మే 10కి ముందు సర్వే, వీడియోగ్రఫీపై చర్యపై నివేదికను కోరింది. అలాగే మే 10న దానిపై విచారణ ఉంటుందని తెలిపింది.
నివేదికల ప్రకారం శృంగార్ గౌరీ దేవత చిత్రం జ్ఞాన్వాపి మసీదు వెలుపలి గోడలో ఉంది. రామజన్మభూమి ఉద్యమం సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత, భక్తులకు సాధారణ ప్రవేశం నిషేధించారు. చైత్ర నవరాత్రుల నాల్గవ రోజున మాత్రమే ఈ దేవతను ఆరాధించదానికి అనుమతిస్తారు.