అవినీతిపై యోగి ఉక్కుపాదం
ఉత్తర ప్రదేశ్ లోని మురాద్ నగర్ లో ఇటీవల స్మశాన వాటిక పైకప్పు కూలి 20 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై అక్కడి ముఖ్యమంత్రి మోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. మురాద్ నగర్ మున్సిపాలిటీ ద్వారా ఆ పనులు పర్యవేక్షించిన ఇంజినీర్ పైనా, దాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ పైనా జాతీయ భద్రతా చట్టం (ఎన్.ఎస్.ఎ) కింద కేసు నమోదుకు ఆదేశించారు.
ఇంజినీర్, కాంట్రాక్టర్ ల ఆస్తులను వేలం వేయబోతున్నారు. ఆ డబ్బుల నుంచి మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని యోగి సర్కార్ నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వబోతున్నారు. అవినీతిపై ఉక్కు పాదం మోపడం అనేది చాలా మంది సీఎంలు మాటల్లోనే చెప్తారు. యోగి చేతల్లో నిరూపిస్తున్నారు.