పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్లోని సిలిగురిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కోవిడ్-19 మహమ్మారి ముగిసిన మరుక్షణమే పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేస్తామని అన్నారు. ‘సీఏఏను క్షేత్రస్థాయిలో అమలు చేయబోమని టీఎంసీ పుకార్లు పుట్టిస్తోంది. అని ఆయన అన్నారు. మమతా బెనర్జీ చొరబాట్లను కోరుకుంటున్నారు… కానీ CAA ఉంది, చివరికి అదే నిజం అవుతుంది” అని అన్నారు.
మమతకు బెంగాల్ ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు.దీదీ మారుతారని మేం ఆశించాం. కానీ అవినీతి, సిండికేట్ సహా బీజేపీ కార్యకర్తల హత్యలింకా రాష్ట్రంలో ఆగలేదని ఆయన ఆరోపించారు.
ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆమె ప్రతినిధి బృందాన్ని పంపుతుందని… కానీ 8 మంది మహిళలు తోపాటు ఒక చిన్నారిని సజీవ దహనం చేసిన బీర్భూమ్కు ఆమె ఎందుకు ప్రతినిధి బృందాన్ని పంపలేదు, వారు ఆమె ప్రజలు కాదా? అని షా నిలదీశారు.
“బెంగాల్ అసెంబ్లీలో బిజెపి సంఖ్యను మూడు నుంచి 77కి పెంచినందుకు ఉత్తర బెంగాల్ ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. టిఎంసి నిరంకుశ పాలనను నిర్మూలించే వరకు బిజెపి విశ్రమించదు. దీదీ ఎప్పుడూ గూర్ఖా సోదర సోదరీమణులను తప్పుదోవ పట్టించేవారని, గూర్ఖాల ప్రయోజనాల కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయేనని చెప్పడానికే నేను ఈరోజు వచ్చానని హోంమంత్రి అన్నారు.