బీహార్ లోని ఒక అవినీతి అనకొండ బండారం బయట పడింది. గుట్టలుగా పోగు పడిన కట్టలను చూసి ఏసీబీ విజిలెన్స్ అధికారులకు కళ్లు తిరిగాయి. ఇంట్లో బీరువాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు మూలుగుతున్నాయి. వీటిని లెక్కించటానికి నోట్ల లెక్కింపు మెషిన్స్ తెప్పించారు.
బీహార్ ప్రాంతంలోని రజనీకాంత్ ప్రవీణ్ బసంత్ ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. దీంతో కోట్ల విలువైన నగదు దొరికినట్లు సమాచారం. ఇంటి లోపల పోలీసు బలగాలను మోహరించారు.
ఇప్పుడు అతని బంధువులు, స్నేహితుల ఇళ్ల లో సైతం సోదాలు చేస్తున్నారు. మూడేళ్లుగా ఇదే జిల్లా లో డీఈవో గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తారని ఆయనకు పేరు ఉన్నది. ఈ క్రమంలోనే కోట్ల రూపాయిలు దోచేసి ఉంటారని తెలుస్తోంది.
రజనీకాంత్ ఇంటిలోని నోట్ల కట్టలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.