కరోనా సెకండ్ వేవ్ ఉధృతమైన సందర్భంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ నరేంద్రమోదీకి ఓ లేఖ రాశారు. అయితే చైనా కమ్యూనిస్డు పార్టీ అనుబంధ ఓ సోషల్ మీడియా ఖాతాలో భారతదేశాన్ని అపహాస్యం చేస్తూ చైనీస్ సైట్ వీబో రెండు ఫొటోలు పబ్లిష్ చేసింది. దానిపై చైనా ప్రజానీకం విమర్షలు తలెత్తడంతో ఆ రెండు పోస్టుల్నీ తొలగించింది వీబో.. ఇంతకీ ఆ ఫొటోలు ఏంటి…
1] చైనాప్రయోగించిన అంతరిక్ష రాకెట్ మంటలను ….భారత శ్మశానవాటికలోకాలుతున్నశవాల మంటలతో పోల్చి చూపించింది . అంటే దాని అర్ధం చైనా శాస్త్ర సాంకేతిక రంగాలలో నిప్పులు చెరుగుకుంటూ అంతరిక్షంలోకి దూసుకొనిపోతుంటే… భారత్ శవాల మంటలతో దయనీయంగా ఉందీ అని…
2] 2 019 లోవుహాన్లోనిర్మించిన చైనా యొక్క ‘ఫైర్ గాడ్ అంటువ్యాధుల పరిశోధన కేంద్ర ఆస్పత్రిని….భారతదేశంలో సామూహిక దహన సంస్కారాల ఛాయాచిత్రంతో పోల్చి చూపించింది. అంటే మేము అంటువ్యాధులను అరికట్టేందుకు పరిశోధనలు చేస్తూ మందులు కనిపెట్టి రోగులను కాపాడుతూ ఉంటే భారత్ అంటూవ్యాధులతో చనిపోయినవారిని సామూహిక దహన సంస్కారాలు చేస్తున్నది. భారత్ పరిస్థితి ఇదీ మాపరిస్థితీమో ఇదీ అన్నట్టు.
గడిచిన రెండెళ్లలో పరిస్థితిని గమనిస్తే కనుక…చైనా దౌత్యవేత్తలు ‘వోల్ఫ్ వారియర్స్’ఇతర దేశాలపై అప్రజాస్వామిక పద్దతిలో దూకుడుగామాట్లాడుతూ వస్తున్నారు. వోల్ఫ్ వారియర్స్ దౌత్యవేత్తలు ఆస్ట్రేలియా, ఇండియా, యుఎస్ , అనేక యూరోపియన్ దేశాలను స్థానిక , అంతర్జాతీయ అంశాలపై విమర్శలు చేస్తున్ననారు. ఐరోపాలో కరోనావైరస్ వ్యాప్తి , ఇండో-పసిఫిక్పై అమెరికా విధానాలు , కరోనావైరస్ వ్యాప్తి వెనుక ఎవరు ఉన్నారు అనే విషయం పై ఆస్ట్రేలియా చేస్తున్న ప్రయత్నాలు, లడఖ్లో చైనా అక్రమణను భారత్ ఎదుర్కోవడం మొదలైన అంశాలపై చైనా దౌత్యవేత్తలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు పలుమార్లు. అంటే ప్రపంచం లో మాకు తిరుగులేదు మేము ఎవరిని లెక్క చేయం అది అమెరికా కావచ్చు… భారత్ కావచ్చు అన్నట్టు వ్యవహరించింది అప్పుడు.
అదే సమయంలో తమకు ఎదురులేదు అని విర్రవీగుతున్న చైనాకు భారత్ ఎదురు నిలిచింది. సరిహద్దులలో చైనాను కట్టడి చేసింది, శా స్త్ర సాంకేతిక రంగాలలో కూడా భారత్ దూసుకొని పోతున్నది, ఇది చైనా అహంకారంపై దెబ్బకొట్టినట్లు అయింది .దానితో తట్టుకోలేక రెచ్చిపోయి కరోనా రెండవ వేవ్ లో భారత్ ఇబ్బందులు పడుతూ ఉంటే అపహాస్యం చేస్తూ సంకుచితత్వాన్ని బయటపెట్టుకుంది.
చిత్రంగా అక్కడి ప్రజలనుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. చైనాప్రజల విమర్షల ధాటి తట్టుకోలేక కాసేపటికే రెండు ఫొటోలను తొలగించింది వెబో సైట్.
ఇక ఇవాల్టి వార్త
మరోవైపు ఎన్నడూ లేనిది చైనా తీరుపై మండిపడింది న్యూజిలాండ్. . ఇప్పటివరకు ఆదేశం చైనాను ప్రత్యక్షంగా ఏనాడూ విమర్శించలేదు. జిన్జియాంగ్లో మానవ హక్కులపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అర్డెర్న్ విమర్శలు చేశారు. న్యూజిలాండ్ తాజా ప్రకటన చైనా పట్ల మారుతున్న వారి వైఖరి స్పష్టం చేస్తోంది..
తన ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న చైనాలో మానవ హక్కుల సమస్యపై ఇప్పుడు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో న్యూజిలాండ్ కలిసి వస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఆక్లాండ్లో జరిగిన చైనా బిజినెస్ మీట్లో న్యూజిలాండ్ ప్రధాని జెసిండా.. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లోని ఉయ్గార్లపై అనుసరిస్తున్న తీరుతోపాటు హాంగ్కాంగ్ లో ప్రజల నిరసనలపై కూడా జెసిండా ఆందోళన వ్యక్తం చేశారు.
జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉయ్గార్ ముస్లింలపట్ల చైనా హింసాకాండ అందరికీ తెలిసిందే. ప్రపంచానికంతా తెలిసి ఒక్కో దేశం నిలదీస్తుంటే అబద్దాల వ్యాప్తి మొదలుపెట్టింది ఆదేశం.
ఉయ్గార్స్పై ది మౌంటెన్స్ – లైఫ్ ఆఫ్ జిన్జియాంగ్ అనే డాక్యుమెంటరీ రూపొందించి… జిన్జియాంగ్లో అంతా బాగానే ఉందని చెప్పే ప్రయత్నం చేసింది. అయితే ఆ డాక్యుమెంట్లో ఉన్నదంతా శుద్ధ తప్పు అని ఉయ్గార్ లోని పోరాట కార్యకర్తలు తేల్చి చెప్పడంతో మరోసారి చైనా దుర్మార్గం లోకానికి తెలిసి వచ్చింది.