కరోనా ఎవరినీ వదలడం లేదు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు సహా పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ కరోనాతో చనిపోయారు. కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆశిష్ చనిపోయాడు. తనయుడు ఆశిష్ మరణవార్తను ట్వీట్ ద్వారా వెల్లడించిన సీతారా ఏచూరీ. ‘ నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కరోనాతో పోరాడుతూ నేటి ఉదయం కన్నుమూశాడు. ఆశిష్ ను కాపాడేందుకు శ్రమించిన డాక్టర్లు, వైద్య సిబ్బందికి, ఫ్రంట్లైన్ హెల్త్ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.