దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డులు బ్రేక్ చేస్తూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1.31 లక్షల కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. కరోనా మహమ్మారి బారినపడి 780 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 1,67,642కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,79,608 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 9.43 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
https://twitter.com/ANI/status/1380375460312309763