https://twitter.com/narendramodi/status/1369927412373282818
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతంగా జరుగుతోంది. 60 ఏళ్లు దాటిన వారితో పాటుగా.. 45 ఏళ్లకు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని, రాష్ట్రపతితో సహా.. పలువురు రాజకీయ అగ్రనేతలు కూడా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరెబెన్ మోదీ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించారు. “మా అమ్మ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ చుట్టుపక్కల వ్యాక్సినేషన్కు అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాల్సిందిగా నేను కోరుతున్నాను” అంటూ మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.