కరోనా వైరస్ ఎవర్నీ వదలడం లేదు. నిత్యం జనంలో ఉండే రాజకీయ నాయకులు ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కరోనా బారిన పడ్డారు. ఇక ఈమధ్యే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకగా…. తాజాగా ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ కూ పాజిటివ్ వచ్చింది.
కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులకు వెళ్లానని కోవిడ్ పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారని కేటీఆర్ చెప్పారు. ఈ విషయాన్ని తెలుపుతూ మంత్రి ట్వీట్ చేశారు. ‘నాకు కరోనా పాజిటివ్. స్వల్పంగా లక్షణాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా నన్ను కలుసుకున్న వారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోండి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి’ అని ట్వీట్ చేశారు .