కరోనా బీభత్సం మే నెల మధ్య నాటికి ఉగ్రరూపం దాల్చేప్రమాదం ఉందని ఐఐటీ శాస్త్రవేత్తలు అంటున్నారు.. మే మధ్య నాటికి దేశంలో కేసుల సంఖ్య 33-35 లక్షలకు చేరుకుంటుందని అంచనా. మేథమెటికల్ మోడల్ ఆధారంగా అంచనాలను సవరించిన శాస్త్రవేత్తలు.. మేలో రోజుకు కొత్తగా 4.4 లక్షల నుంచి 7-8 లక్షల మధ్య కొత్తగా కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. దేశంలో ఇవాళ 3,52,991 కేసులు నమోదయ్యాయి. 2,812 మంది ప్రాణాలు కోల్పోయారు. 28,13,658 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూర్), హైదరాబాద్ శాస్త్రవేత్తలు.. ససెప్టిబుల్, అన్డిటెక్టెడ్, టెస్ట్డ్ (పాజిటివ్), రిమూవ్డ్ అప్రోచ్ (ఎస్యూటీఆర్ఏ) మోడల్ ఆధారంగా అధ్యయనం చేశారు…