కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కొద్దీ దేశం ఆక్సిజన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పవచ్చు. ఆక్సిజన్ కు డిమాండ్ పెరుగుతుంటే…మరోవైపు డిమాండ్కి తగినంత సప్లై లేని పరిస్థితి.
అసలైతే గతంలో రోగులకు మెడికల్ ఆక్సిజన్ అవసరమైతే.. వారు చికిత్స పొందుతున్న ఆస్పత్రులే ఆ ఏర్పాట్లు చూసేవి. కానీ ఇప్పుడు ఆక్సీజన్కి కొరత ఏర్పడటంతో చాలామంది కరోనా రోగులు, వారి కుటుంబసభ్యులు ఆక్సీజన్ కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న కరోనా రోగుల కష్టాలు స్వయంగా చూస్తున్న కొందరు ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవెల్స్ పై అవగాహన పెంచుకుంటున్నారు. ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవల్స్ ఏ స్థాయిలో ఉంటే…శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండవు,. ఎలాంటి స్థితిలో వైద్యులను సంప్రదించాల్సి ఉండాల్సి ఉంటుంది చూద్దాం.
వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఆక్సిజన్ లెవెల్స్ 94 శాతం కంటే ఎక్కువ ఉన్నంతవరకు ఇబ్బంది ఉండదు. వారికి ప్రాణాపాయం లేనట్టే. అంతకన్నా తగ్గితే మాత్రం జాగ్రత్తపడాలి.అయితే ఇది పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే… అలా కాక…ఇతర అనారోగ్య సమస్యలున్నవారి నార్మల్ ఆక్సిజన్ లెవెల్స్, ఇతర ఆరోగ్య సమస్యలపై ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకు సీవోపీడీ లేదా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారిలో ఆక్సిజన్ లెవెల్స్ 88-92మధ్య ఉండడం సాధారణం. అలాంటి వారిలో ఆక్సిజన్ లెవల్స్ 94 కన్నా తక్కువగా ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. .
నార్మల్ గా ఉండేవాళ్లు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి….దాంతో పాటు ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గు, అజీర్తి, వాంతులువంటి లక్షణాలుంటే మాత్రం కరోనా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు…. పాజిటివ్ వస్తే కనుక ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించి చికిత్స మొదలుపెట్టాలి.