కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేస్తోంది. గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో దేశంలో మరోసారి డేంజర్ బెల్స్ మొగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలోని నాందేడ్ పట్టణంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో అధికారులు కరోనా కట్టడికి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే మార్చి 31వ తేదీ వరకు నాందేడ్లోని అన్ని ఆలయాలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు.. దుకాణాలను కూడా ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు తెరిచేందుకు అనుమతిస్తున్నారు. అయితే ఆలయాల్లో నిత్య దీపారాధన కొనసాగుతోందని.. కేవలం భక్తులకు మాత్రమే అనుమతులు లేవని నాందేడ్ కలెక్టర్ తెలిపారు.