దేశంలో కరోనా మరణ మృదంగం చేస్తోంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో వెయ్యి మందికి పైగా మరణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతుండటం.. మరోవైపు రికవరీ రేటు తగ్గుతుండటం కలకలం రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,84,372 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా మహమ్మారి నుంచి కోలుకుని 82,339 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఈ మహమ్మారి బారినపడి 1,027 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారినపడి మరణించిన వారి సంఖ్య 1,72,085కు చేరింది. ఇక దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగవంతంగానే జరుగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా11.11 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది
India reports 1,84,372 new #COVID19 cases, 82,339 discharges and 1,027 deaths in the last 24 hours, as per Union Health Ministry
Total cases: 1,38,73,825
Total recoveries: 1,23,36,036
Active cases: 13,65,704
Death toll: 1,72,085Total vaccination: 11,11,79,578 pic.twitter.com/8fiNUNDp6W
— ANI (@ANI) April 14, 2021