కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నిన్నమొన్నటి వరకు లక్షకుపైగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో రికార్డులు బ్రేక్ చేస్తూ రెండు లక్షల మార్క్ను దాటేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,00,739 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక కరోనా మహ్మారి నుంచి కోలుకుని 93,528 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినపడి 1,038 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 1,73,123కి చేరింది. ఇక కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 11.44 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
https://twitter.com/ANI/status/1382544627853529092