దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నెల రోజులుగా కేసుల సంఖ్య అమాంతం పెరుగుతుండటంతో ఆందోళన కలుగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 89 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. కరోనా మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 89,129 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 714 మంది కరోనా మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,92,260కు చేరగా.. ప్రస్తుతం 6,58,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా 1,64,110 మంది మృతిచెందారు.
కాగా, దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా వేగంగా కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7 కోట్ల 30 లక్షల 54 వేల మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 ఏళ్ల వయస్సు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే.
https://twitter.com/ANI/status/1378201183760703498