మతమార్పిళ్ల అంశం తీవ్రమైందని అయితే దానికి రాజకీయ రంగు పులమడం సమంజసం కాదని సుప్రీకోర్టు వ్యాఖ్యానించింది. మోసపూరిత మతమార్పిళ్లకు వ్యతిరేకంగాకేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన సుప్రీం. రాజకీయ దురుద్దేశంతోనే ఈపిటిషన్ దాఖలు చేసినట్టు అనిపిస్తోందని..అయితే దీనికి రాజకీయరంగం సరికాదని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బలవంతంగా ఏదైనా ఆశచూపి, మతం మారిస్తే ఏం చేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై న్యాయస్థానానికి సాయం చేయాలని ఏజీకి సూచించింది ధర్మాసనం.